రేషన్ కార్డుల పునరుద్దరించాలని టీడీపీ ధర్నా
కడప ఫిబ్రవరి 10
తోలగించిన పెన్షన్లు, రేషన్ కార్డులను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల పెంక్షన్లు తొలగించడం దారుణం అన్నారు. రాష్ట్రంలో దాదాపు 7లక్షల వృద్ధ, వితంతు, వికలాంగుల పెన్షన్ల వైస్సార్సీపీ ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలంగించారన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పేదవారు పెంక్షన్లు తొలగించిన దాఖలాలు లేవు అన్నారు. మాట తప్పి మడమ తిప్పిన జగన్ కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తొలగించిన పెన్షన్ లు తిరిగి అమలు చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు....