బీజేపీ రాస్తారోకో
చిత్తూరు ఫిబ్రవరి 10
శ్రీకాళహస్తి పట్టణంలోనిపురపాలక సంఘం వద్ద ఉన్న కూడలిలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అర్హులైన పేదప్రజల పేన్షన్లు ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ మద్రాసురోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. తరువాత పట్టణ అధ్యక్షుడు కాసరం రమేష్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రావడంతోనే ప్రజల పై ఉక్కుపాదం మోపారని ఆరోపించారు. దీనికి నిదర్శనంగా ప్రజలకు పెన్షన్లు ఎత్తివేయడం, రేషన్ కార్డులు రద్దు చేయడం, లాంటి ప్రజలకు ఇబ్బంది కరమైన కార్యక్రమాలు చేపట్టారని కేంద్ర నిధులతో ఇస్తున్న పెన్షన్లు ఎత్తివేయడం దారుణమైన చర్య అని విమర్శించారు