YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

908కి చేరిన కరోనా మృతుల సంఖ్య

908కి చేరిన కరోనా మృతుల సంఖ్య

908కి చేరిన కరోనా మృతుల సంఖ్య
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 10 
చైనాలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆదివారం ఒక్క రోజు 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 908కి చేరుకున్న‌ది. అయితే ఆ వైర‌స్ సోకిన వారి సంఖ్య మాత్రం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు చైనా పేర్కొన్న‌ది.  తాజా లెక్క‌ల ప్ర‌కారం సుమారు 41వేల మందికి క‌రోనా సోకింది. కొత్త వైర‌స్‌ను ప‌రీక్షించేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌న నిపుణుల‌ను బీజింగ్‌కు పంపించింది.  గ‌త వారం క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య కొత్త రికార్డు నెల‌కొల్పింది. గ‌తంలో సార్స్ వ‌ల్ల సుమారు 774 మంది చ‌నిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య‌ను క‌రోనా దాటేసింది. 

Related Posts