YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 వ్యవసాయ విజ్ఞానమార్పిడి కోసం ఒప్పందాలు

 వ్యవసాయ విజ్ఞానమార్పిడి కోసం ఒప్పందాలు

 వ్యవసాయ విజ్ఞానమార్పిడి కోసం ఒప్పందాలు
అమరావతి ఫిబ్రవరి 10 
వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు దిశగా ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. వివిధ అంశాల్లో విజ్ఞానమార్పిడి, శిక్షణలకోసం 11 జాతీయ ప్రఖ్యాత  సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సంస్థలతో వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  ముఖ్యమంత్రి  వైయస్.జగన్ సమక్షంలో వ్యవసాయ, పశు సంవర్థక శాఖ అధికారులు, 11 జాతీయ సంస్థల ప్రతినిధుల మధ్య ఒప్పందాల సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో  మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని పాల్గోన్నారు. చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్, న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, న్యూఢిల్లీలోని సాయిల్ సైన్స్ డివిజన్, హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, ఫరీదాబాద్లోని సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ మరియు శిక్షణ సంస్థ, వారణాశిలోని నేషనల్ సీడ్ రీసెర్చ్ మరియు శిక్షణ సంస్థ, హైదరాబాద్లోని సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, కర్నాల్లోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ , ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బెంగుళూరుకు చెందిన సదరన్ రీజినల్ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ మరియు ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్, ఐసీఏఆర్ – సీఐఎఫ్ఏ సంస్థలతో అవగాహన కుదిరాయి.  ముఖ్యమంత్రి వైయస్.జగన్ మాట్లాడుతై మీతో భాగస్వామ్యం చాలా ముఖ్యం. పరిపాలనను గ్రామ స్థాయిలో తీసుకెళ్లడానికి చాలా ఉపయోగపడుతుంది. అధికారంలోకి రాగానే గ్రామ స్థాయిలోకి పరిపాలనను తీసుకెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేశామని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రతి 2వేల జనాభాకు ఏర్పాటు చేశాం. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేశాం. వివక్ష లేకుండా, అవినీతి రహితంగా, నిర్దేశిత సమయంలోగా సర్వీసులను అందిస్తున్నామని అన్నారు. లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలముందే ఉంచుతున్నాం. వీటికి అనుబంధంగా 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. జూన్ నాటికి మొత్తం అన్ని రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. అగ్రికల్చర్ అసిస్టెంట్లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు, వెటర్నరీ, ఆక్వా అసిస్టెంట్లు కూడా ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఉంటారని అన్నారు. నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాం. నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో లభించే విత్తనాలు, పురుగు మందులు, ఎరువులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. సేంద్రీయ వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్పైన రైతులకు శిక్షణ ఇస్తాం. ఉత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. పంట వేసేముందే పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తాం. రైతుకు నష్టం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తుంది. దీనివల్ల మార్కెట్లో పోటీ పెరుగుతుంది, రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయి. అయినా సరే.. సరైన ధర రాకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరలతో రైతులను ఆదుకుంటామని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఆకాశమే హద్దుగా పనిచేస్తాయి. నేచురల్ ఫార్మింగ్కు సంబంధించి మరికొన్ని సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. అగ్రి మార్కెటింగ్ అంశాలపైనా కూడా ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. రైతు భరోసాకేంద్రాలకు వివిధ అంశాల్లో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉండాలి. పశువులకు మంచి వైద్య సేవలు అందాలి. రాష్ట్రంలో 50శాతం మంది రైతులు 1.25 ఎకరాల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్నవారేనని అయన అన్నారు. 70శాతం రైతులు 1 హెక్టారుకన్నా తక్కువ విస్తీర్ణం ఉన్నవారే. రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికీ ఏడాదికి రూ.13500 ఇస్తున్నాం. ఈ రూపంలో దాదాపుగా 80శాతం పెట్టుబడి ఖర్చు ఇస్తున్నాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నగదు బదిలీ ఇస్తున్నాం. ఈ డబ్బును బ్యాంకులు మినహాయించకుండా అన్ ఇంకబర్డ్ బ్యాంకు ఖాతాల్లోకి వేస్తున్నాం.రైతులు కట్టాల్సిన పంటబీమాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. 60 శాతం ఫీడర్లలో 9 గంటలపాటు రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. ఈ జులై నాటికి మిగిలిన ఫీడర్లలో కూడా అందించడానికి ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నామని జగన్ అన్నారు. 

Related Posts