YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇది అప్పుల తెలంగాణ

ఇది అప్పుల తెలంగాణ

ఇది అప్పుల తెలంగాణ
యాదాద్రి ఫిబ్రవరి 10 
కేంద్రంలో రాష్ట్రంలో పాలకులు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారు.  ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి వెయ్యడం అంటే దేశాన్ని అమ్మి వేయడమే. ప్రధాని మోడీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అరోపించారు. సోమవారం నాడు  భువనగిరి లో  మీడియాతో మాట్లాడారు. భారత్ లౌకిక దేశం అని డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ అప్పుడే నిర్ణయించి రాజ్యంగాన్ని రచించారు. ప్రధాని రాజ్యంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అందుకు పరాకష్టే...దేశంలో చిచ్చు పెట్టిన పౌరసత్వం సవరణ బిల్లని అన్నారు.  బంగారు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ హయాంలో అప్పుల తెలంగాణ అయింది. ఇప్పటికి ఉద్యోగాల కల్పనపై ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతా పత్రం విడుదల చేయాలని అయన అన్నారు. 

Related Posts