YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 పరిశ్రమలు బలవుతున్నాయి

 పరిశ్రమలు బలవుతున్నాయి

 పరిశ్రమలు బలవుతున్నాయి
అనంతపురం ఫిబ్రవరి 10 
అనంతపురంలో కియా పరిశ్రమపై ఒత్తిడి తీసుకొచ్చి తరిమికొట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోసించారు. ఎంపి మాధవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన కియా పరిశ్రమ కోసం స్ధానిక ఎంపి ఏమైనా కృషి చేశారా అని ప్రశ్నించారు. పరిశ్రమ స్ధాపన కోసం కృషికి తగిన ప్రతిఫలం దక్కిందంటే చంద్రబాబుతోనే సాద్యమైందని అన్నారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతల ధనదాహనం కోసం పరిశ్రమలు సైతం బలైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ పరిశ్రమలపై ప్రతాపం చూపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కియా పరిశ్రమ కోసం టిడిపి అవసరమైతే పోరాటం చేస్తుందని చెప్పారు.

Related Posts