ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
అత్యధికంగా డబుల్ బెడ్ రూమ్ కోసమే
ఆర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ జి రవి
ఫిబ్రవరి 10
ప్రజా సమస్యలన్ని సత్వరమే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ లో సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నామని ,తమ సమస్యలు పట్టించుకోండి అంటూ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా అర్జీదారులు వచ్చారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నేరుగా జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వస్తున్ననట్లు కలెక్టర్, జెసి దృష్టికి సమస్యలు నేరుగా తీసుకెళ్తే త్వరగా పరిష్కారమవుతాయనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నామని బాధితులు అన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ప్రజల నుండి 52 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం పట్టణం 36, గ్రామీణ 02, ఇతర 14 అత్యధికంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని వచ్చినవే ,బాధితుల నుంచి వినతులు అందినట్లు తెలిపారు. ప్రజల నుండి వినతులను స్వీకరించి సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ బి.రాజేశం ,డీఆర్వో ఆరుణశ్రీ ,ఆర్డీవో నరేందర్, జిల్లా అధికారులు సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.