YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

నిన్న జగన్... నేడు కేజ్రీవాల్... ఇద్దరి వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..

నిన్న జగన్... నేడు కేజ్రీవాల్... ఇద్దరి వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..

నిన్న జగన్... నేడు కేజ్రీవాల్... ఇద్దరి వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..
మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌కు తిరుగులేని రాజకీయ వ్యూహాలు అందించి ఘన విజయం దక్కేలా చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... బీజేపీని అడ్డుకుని మరోసారి కేజ్రీవాల్ ఢిల్లీ పీఠం దక్కించుకోవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఎన్నికల వ్యూహకర్తగా తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు పీకే.ఢిల్లీలో అనుకున్నట్టే జరిగింది. ఆప్ అదరగొట్టింది. చీపురు పార్టీ ప్రత్యర్థులను ఊడ్చిపారేసింది. ఢిల్లీ వాసుల మనసు గెలుచుకున్నది ఒక్క కేజ్రీవాల్ మాత్రమే అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి మరోసారి చాటి చెప్పింది. దేశవ్యాప్తంగా బలంగా ఉన్న బీజేపీ హవాను తట్టుకుని ఢిల్లీ కోటలో మరోసారి కేజ్రీవాల్ పాగా వేయడం చిన్న విషయమేమీ కాదు. మోదీ మేనియా... అమిత్ షా మంత్రాంగాన్ని తట్టుకుని కేజ్రీవాల్ విజయఢంకా మోగించడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఆ కారణాలన్నింటి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ మాత్రం ఒక్కడే.  లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో ఇక ఆప్ పనైపోయినట్టే అని చాలామంది భావించారు. మరికొన్ని నెలల్లో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్ సభ తరహా ఫలితాలే రిపీట్ 

Related Posts