YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడో అధికారిపై వేటు రెడీ అవుతోందా

మూడో అధికారిపై వేటు రెడీ అవుతోందా

మూడో అధికారిపై వేటు రెడీ అవుతోందా
విజయవాడ, ఫిబ్రవరి 11,
ఏపీ సీఎంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు అధికారులపై వరుస చర్యలు షురూ అయిపోయాయి. ఈ తరహా చర్యలు ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగానే మారిపోయాయని చెప్పక తప్పదు. ఇప్పటిదాకా ఇద్దరు కీలక అధికారులను సస్పెండ్ చేసిన జగన్ సర్కారు... అంతటితో ఈ చర్యలను ఆపేది లేదని, మున్ముందు మరింత మంది అదికారులపై చర్యలు తప్పవని కూడా స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఈ తరహా వార్తలకు తాజాగా వైసీపీ కీలక నేత, మంత్రి బొత్స సత్యనారాయణ  చేసిన ఓ కామెంట్ నిదర్శనంగా నిలుఃస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా బొత్స నోట నుంచి వచ్చిన మాట ఏమిటన్న విషయానికి వస్తే... ‘‘అవినీతి ఆరోపణలపైనే ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఏబీతో పాటు మరో అధికారిపై ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతానికి ఓ అధికారిపై వేటు పడింది. త్వరలో మరో అధికారిపైనా చర్యలు తీసుకోనున్నాం’’ అని బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలు చూస్తుంటే... ప్రస్తుతం ఐటీ దర్యాప్తు చేస్తున్న అధికారి పెండ్యాల శ్రీనివాసరావే. గతంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వద్ద పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన పెండ్యాలపై ఐటీ శాఖ గడచిన ైదు రోజులుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.అంటే.. ఆ మధ్య ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ ను సస్సెండ్ చేసిన జగన్ సర్కారు... ఆయనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై జాస్తి... సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్)ను ఆశ్రయించగా... ఆ వివాదం క్యాట్ లో విచారణ సాగుతోంది. ఈ వ్యవహారంపై క్యాట్ లో విచారణ సాగుతున్నా... జగన్ సర్కారు జాస్తిపై దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంది. తాజాగా రెండు రోజుల క్రితం సీనియర్ ఐపీఎస్ అదికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును రాత్రికి రాత్రే సస్పెండ్ చేసిన జగన్ సర్కారు... జాస్తికి మాదిరే ఏబీపైనా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బొత్స వ్యాఖ్యలతో పెండ్యాలపైనా సస్పెన్షన్ వేటు పడటం ఖాయంగానే కనిపిస్తోంది.   ట్రిపుల్ సీ ఫార్ములా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.... ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నయా మంత్రాన్ని అమలు చేస్తున్నారు. ఆంగ్ల పదం ‘సీ’తో అల్లుకున్న ఆ మంత్రాన్ని అందరూ ఇప్పుడు ‘ట్రిపుల్ సీ’ గా పిలుస్తున్నారు. ఈ మంత్రం విపక్షానికి చెందిన నేతలను, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారులను టార్గెట్ చేసేందుకే కాకుండా... తన సొంత పార్టీకి చెందిన సొంత మనుషుల విషయంలోనూ జగన్ ఇదే ఫార్మూలాను అమలు చేస్తున్నట్లుగా కూడా ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు... సాంతం డిఫెన్సివ్ మోడ్ లోనే సాగిన జగన్... అధికారం చేతికందగానే అఫెన్సివ్ మోడ్ లోకి వచ్చేశారు. ఈ క్రమంలో ట్రిపుల్ సీ ఫార్ములాను విపక్షం విషయంలో ఒక రకంగా, తన సొంత పార్టీ నేతల విషయంలో మరోరకంగా అమలు చేస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు.సరే... ముందుగా విపక్షానికి అన్వయిస్తున్న ట్రిపుల్ సీ కి అర్థం ఏమిటంటే... సీ-కరప్షన్, సీ- క్యాస్ట్, సీ- కేడర్ (టీడీపీ). సో... టీడీపీ విషయంలో ట్రిపుల్ సీ అంటే... కరప్షన్, క్యాస్ట్, కేడర్ గా జగన్ తన ఫార్మూలాకు పేరు పెట్టేసుకున్నారు. ఇక సొంత పార్టీ వాళ్ల విషయానికి వచ్చేసరికి... సీ- క్యాష్, సీ- క్యాస్ట్, సీ-కేడర్ (వైసీపీ)గా ట్రిపుల్ సీకి జగన్ నిర్వచనం పెట్టేసుకున్నారు. 

Related Posts