YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

బంగారం తగ్గింది... వెండి ధర పెరిగింది

బంగారం తగ్గింది... వెండి ధర పెరిగింది

బంగారం తగ్గింది... వెండి ధర పెరిగింది
ముంబై, ఫిబ్రవరి 11,
పసిడి ధర తగ్గింది. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు మాత్రం స్వల్పంగా కిందకు దిగింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. భారీగానే పరుగులు పెట్టింది. దీంతో బంగారం ధర తగ్గితే.. వెండి ధర పెరిగినట్లు అయ్యింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటంతో దేశీ మార్కెట్‌లో పసిడి ధర దాదాపు స్థిరంగానే ఉంది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.32 శాతం పెరిగింది. 1,578.45 డాలర్లకు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.54 శాతం పెరుగుదలతో 17.78 డాలర్లకు ఎగసింది.హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పసిడి ధర 10 గ్రాములకు కేవలం రూ.10 క్షీణించింది. దీంతో ధర రూ.38,990 నుంచి రూ.38,980కు తగ్గింది.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. నిలకడగానే ఉంది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,530 వద్దనే కొనసాగుతోంది.బంగారం ధర దాదాపు స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.49,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.38,980కు క్షీణించింది. వెండి ధర రూ.49,300కు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.290 ఎగసింది. దీంతో ధర రూ.41,000కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా , ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.పసిడి రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Related Posts