YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 రాహుల్‌, ప్రియాంక కూడా ఆప్‌కే ఓటేశారు: బీజేపీ

 రాహుల్‌, ప్రియాంక కూడా ఆప్‌కే ఓటేశారు: బీజేపీ

 రాహుల్‌, ప్రియాంక కూడా ఆప్‌కే ఓటేశారు: బీజేపీ
హైదరాబాద్ ఫిబ్రవరి 11 
 ఢిల్లీలో కాంగ్రెస్‌ ఉనికి కోల్పోయిందని.. రాహుల్‌, ప్రియాంక కూడా ఆప్‌కే ఓటేశారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు. కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్లు అందరూ కలసి ఏకమైనా.. బీజేపీ మెరుగైన స్థానాలు సాధించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర నిధులను మళ్లిస్తోందని ఆరోపించారు.ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి కేంద్రంపై నిందలు వేస్తున్నారని రామచంద్రరావు విమర్శించారు. మందిర్ ముసుగుతో మసీదుకు నిధుల కోసం కేసీఆర్‌ను అక్బరుద్దీన్‌ కలిశారని ఆరోపించారు. అక్బరుద్దీన్‌కు హిందువులపై అభిమానం ఉంటే సీఏఏను వ్యతిరేకించరన్నారు. అభివృద్ధిపై ధ్యాస ఉంటే పాతబస్తీలో మెట్రో ఎందుకు అడగరని రామచంద్రరావు ప్రశ్నించారు.

Related Posts