YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బూంది పోటులో మార్చి 29వ తేది గురువారం ఉదయం నుండి బూందీ తయారు

బూంది పోటులో మార్చి 29వ తేది గురువారం ఉదయం నుండి బూందీ తయారు

తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూంది పోటులో మార్చి 29వ తేది గురువారం ఉదయం నుండి బూందీ తయారు చేయనున్నట్లు తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

తిరుమలలోని బూంది పోటులో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించిన విషయం విదితమే. మంటలను అదుపుచేసిన అనంతరం జెఈవో తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ పోటులోని పైకప్పులకు, గోడలకు అంటుకున్న నెయ్యి జిడ్డు వల్ల మంటలు అంటుకున్నాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తక్కువ సమయంలో మంటలను అదుపులోనికి తీసుకువచ్చినట్లు వివరించారు.

ప్రతినెల పౌర్ణమి, అమావాస్యలకు పోటులో మాస్‌ క్లినింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఎలాంటి అస్తి నష్టం సంభవించలేదని జెఈవో తెలిపారు.

Related Posts