YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విపక్షాలవి అనవసర రాద్ధాంతం

విపక్షాలవి అనవసర రాద్ధాంతం

విపక్షాలవి అనవసర రాద్ధాంతం
విశాఖపట్నం  ఫిబ్రవరి 11 
పెన్షన్లపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. వచ్చేనెల నుంచి అర్హులందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఒక్క విశాఖలోనే కాదని.. రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్‌ పూలింగ్‌ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు, అతని సహచరులు ప్రజలను రెచ్చగొడుతున్నారని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి చంద్రబాబు అనుకూలమా వ్యతిరేకమా అనేది చెప్పాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు.
 

Related Posts