YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

 ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు

 ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు

 ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12,
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలో ఆప్ కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని కిషన్‌ఘర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన నరేష్ యాదవ్.. తన అనుచరులతో కలిసి గుడికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మెహ్రౌలి ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఏడు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.అశోక్ మన్ అనే పార్టీ కార్యకర్త కాల్పుల్లో చనిపోయాడని ఆప్ నేత సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ఇవాళ జరిగిన కాల్పుల్లో మేం ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయాం. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది.‘‘మా ఎమ్మెల్యే నరేష్ యాదవ్, అతడి అనుచరులపై అనేకసార్లు కాల్పులు జరిపారు. దుండగులు మరో కార్లో కూర్చొని ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు’’ అని ఆప్ సోషల్ మీడియా ఇంఛార్జ్ అంకిత్ లాల్ ట్వీట్ చేశారు.

Related Posts