YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ దాడులు

ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ దాడులు

ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ దాడులు
గుంటూరు ఫిబ్రవరి 12 
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు నేడు  పెద్ద ఎత్తునే దాడులు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ లోని విష్ణు ప్రియాంక రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమతులు లేని బయో ఉత్పత్తులు, పురుగు మందులు, కాలం చెల్లిన పురుగు మందులను గుర్తించినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4,10,950 విలువ చేసే మందులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇంకా గోడౌన్ తనిఖీ చేయాల్సి ఉందని తెలిపారు. కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఏ డి ఎ మస్తానమ్మ, ఏ ఒ వాసంతి, విజిలెన్స్  సి.ఇ భాష, సునీల్ కుమార్, డి డి ఎ రామాంజనేయులు  తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts