తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని విశాఖను రాజధాని అనడానికి సిగ్గులేదా?: అనిత
విజయవాడ ఫిబ్రవరి 12
తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని విశాఖను రాజధాని అనడానికి సిగ్గులేదా? అని టీడీపీ నాయకురాలు అనిత ఘాటైన వ్యాఖ్యలతో సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. బుధవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె... అమరావతి ఉద్యమం చూసి సీఎం జగన్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం పర్యటనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలు జగన్కు భజన బృందంగా మారారని ఎద్దేవా చేశారు. స్మశానం అంటున్న స్పీకర్ తమ్మినేని సీతారాం కు బుర్ర, బుద్ధి ఉన్నాయా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను విశాఖ వాసినే అని, తనను కూడా బెదిరించారని అనిత ఆరోపించారు.