పుల్వామా అమరవీరుల త్యాగాలు మరువలేనివి
మందమర్రి ఫిబ్రవరి 12
గత సంవత్సరం ఫిబ్రవరి 14న దేశ సరిహద్దుల్లో పుల్వామా ప్రాంతంలో సి ఆర్ పి ఎఫ్ జవాన్లపై ముష్కరులు జరిపిన మానవబాంబు పేలుళ్లలో వీర మరణం పొందిన జవాన్ల త్యాగాలు మరువలేనివని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజలింగు మోతె పేర్కొన్నారు. పుల్వామా అమరుల కు నివాళ్లు అర్పించే కార్యక్రమంలో మేమూ పాల్గొంటామని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు ,స్థానిక యువత మేమూ సిద్ధం అంటూ బుధవారం కరపత్రాలతో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఆర్.ఏ అధ్యక్షుడు రాజలింగు మోతె మాట్లాడుతూ..ఏడాది క్రిందట 2019 ఫిబ్రవరి14 ,3.15 గంటలకు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సీ ఆర్ పీ ఫ్ జవాన్ల పై మానవ బాంబుతో దాడి చేసి ముష్కరులు వారి ప్రాణాలను బలిగొన్న రని మన వీరుల నెత్తుటి మరకలు ఆరిపోయిన ...వారి త్యాగాలను మనం మరిచి పోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్ పి టి సి యాకుబ్ ఆలీ,ఎల్మరెడ్డి రాంరెడ్డి, ఎం.డి పాషా, రామాలయం యూత్ ప్రధాన కార్యదర్శి దండు సదానందం, కుంభం సురేందర్,బాలకృష్ణ, సాయి,భీమ రాజు, మహేందర్, మోహిత్ ,సంపత్ తదితరులు పాల్గొన్నారు.ం