మంత్రులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు:ఎమ్మెల్సీ అశోక్ బాబు
అమరావతి ఫిబ్రవరి 12
రాష్ట్రంలో మంత్రులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీస మర్యాద తెలియని వాళ్లకు జగన్ మంత్రి పదవులు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మండలి చైర్మన్, తమను మంత్రులు బూతులు తిట్టారని ఆరోపించారు. నాడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని.. ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేశారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజధాని 29 గ్రామాలది కాదని, 5 కోట్ల మంది ఆంధ్రులది అని అశోక్ బాబు పేర్కొన్నారు.