YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ గో బ్యాక్ అంటూ నినాదాలు

పవన్ గో బ్యాక్ అంటూ నినాదాలు

పవన్ గో బ్యాక్ అంటూ నినాదాలు
కర్నూలు, ఫిబ్రవరి 12 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతో కర్నూలు నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2017లో అత్యాచారానికి గురై అనుమానాస్పద రీతిలో మరణించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ బుధవారం (ఫిబ్రవరి 12) ర్యాలీ చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమైన విషయం తెలిసిందేఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం పవన్ కర్నూలు చేరుకున్నారు. అయితే పవన్ పర్యటనను అడ్డుకునేందుకు రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతల ప్రయత్నించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు.గో బ్యాక్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. రాయలసీమకు పవన్ అన్యాయం చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో కర్నూలు కలక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ర్యాలీగా వెళ్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితులు కొద్దిగా చక్కబడ్డాయి.

Related Posts