YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 బాబుకు కుప్పంలో షాక్

 బాబుకు కుప్పంలో షాక్

 బాబుకు కుప్పంలో షాక్
తిరుపతి, ఫిబ్రవరి 12
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు షాకిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని సమర్థించారు.. ఈ మేరకు పేరెంట్స్ కమిటీలు తీర్మానాలు చేశాయి. కుప్పం మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి తీర్మానాలు వచ్చాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావడం చాలా సంతోషకరంగా ఉందని మంత్రి అన్నారు.ఇంగ్లీష్ మీడియానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్‌ కమిటీలు తీర్మానాలు చేశాయని మంత్రి తెలిపారు. 43 వేల పాఠశాలల నుంచి వచ్చిన తీర్మాన ప్రతులను పేరెంట్స్‌ కమిటీలు ప్రభుత్వానికి అందజేశాయని.. అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తామన్నారు.. అలాగే మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు.ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయన్నారు సురేష్. సవాళ్లను ఎదుర్కొంటేనే మంచి భవిష్యత్‌ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇంగ్లిష్‌ మీడియంతో పేద విద్యార్థులందరికీ మేలు జరుగుతుందని.. ఉన్నత చదువులు, ఉద్యోగాల విషయంలో ఇంగ్లీష్ భాష ఎంతో ఉపయోగకరం ఉంటుందన్నారు మంత్రి.ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ మీడియం బిల్లును శాసనమండలిలో ఆమోదించుకుండా వెనక్కు పంపారు. దీంతో అసెంబ్లీలోనే మరోసారి ఆమోదం తెలిపారు. ప్రభుత్వం మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

Related Posts