YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 కరీంనగరంలో 18న ఐటీ టవర్ ప్రారంభం

 కరీంనగరంలో 18న ఐటీ టవర్ ప్రారంభం

 కరీంనగరంలో 18న ఐటీ టవర్ ప్రారంభం
కరీంనగర్, ఫిబ్రవరి 13,
కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఐటీటవర్‌ ను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు  బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ తెలిపారు.   ఇక ఈ టవర్ను ప్రారంభిస్తే నిరుద్యోగ యువతకు ఎక్కడికక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఇక్కడ పనిచేసేందుకు 26 కంపెనీలు ప్రభుత్వాన్ని సంప్రదించగా.. ఇప్పటికే 15 కంపెనీలకు స్థలం కేటాయించినట్టు చెప్పారు. అంతేకాదు మొత్తం మూడు షిప్టుల్లో కలిపి మూడు వేలమందికిపైగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. 80శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చర్యలు తీసుకొంటున్నామని వివరించారు. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే ఏడాదిలో మరో టవర్‌కు డిమాండ్‌ వచ్చేలా ఉన్నదని, దీనికి కూడా స్థలం కేటాయిస్తామన్నారు

Related Posts