YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రైల్వే దొంగల ఆరెస్టు

రైల్వే దొంగల ఆరెస్టు

రైల్వే దొంగల ఆరెస్టు
విజయనగరం ఫిబ్రవరి 13,
వేర్వేరు కేసుల్లో ఎనిమిది మంది నింది తులను అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకు న్నట్లు రైల్వే డీఎస్పీ ఆర్శ్రీనివాస్ తెలిపారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలు చేయడం వీరి ప్రత్యేకత అని పేర్కొన్నారు. వీరంతా విజయనగరం, విశాఖ రైల్వేస్టేషన్ల పరిసరాల్లో నిందితులు చోరీలకు పాల్పడినట్లు చెప్పారు. వీటిపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది సంయుక్తంగా దృష్టి సారించి నిందితులను గుర్తించారన్నారు. పక్కా సమాచారంతో విజయనగరంలోని ఓ లాడ్జిలో వీరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. విచారణలో 8 మంది పశ్చిమబెంగాల్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించామన్నారు. వీరి నుంచి 8 కేసులకు సంబంధించి రూ.7లక్షలు విలువ చేసే 210 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Related Posts