వైసీపీ రిలే దీక్షలు
ఎమ్మిగనూరు ఫిబ్రవరి 13,
వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో గురువారం స్థానిక సోమప్ప సర్కిల్ లో వైసీపీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.ఈ రిలే దీక్షాలను వైసీపీ సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు.అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రాయలసీమకు అన్యాయం చేసాడు. ఆ తప్పు చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తుంటే చంద్రబాబు అడ్డుకోవడం తో సీమా ద్రోహి గా మారాడు అని ఎట్టి పరిస్థితుల్లో వికేంద్రీకరణ జరిగితిరుతుంది అని తెలిపారు.ఈ రోజు రిలే దీక్షలు కూర్చున్న నాయకులు మాజీ మున్సిపల్ చెర్మన్ బుట్ట రంగయ్య,మైనారిటీ నాయకులు రియాజ్, వహబ్, వహిద్,
ఈషాక్, ఇమ్రాన్, రఫిక్, చండిబాష, ఉప్పార శ్రీరామ్ లు పాల్గొన్నారు.