ఏం సాధించారని జగన్ను ప్రధాని ప్రశంసిస్తారు?
- బుద్దా వెంకన్న
అమరావతి ఫిబ్రవరి 13,
తొమ్మిది నెలల్లో ఏం సాధించారని సీఎం జగన్ను ప్రధాని మోదీ ప్రశంసిస్తారని టీడీపీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సిగ్గులేకుండా బ్లాక్ పేపర్లో ప్రధాని ప్రశంసించారంటూ రాయించుకున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తుంటే..వెలిగిపోతోందంటూ బ్లాక్ పేపర్లో వార్తలు రాస్తున్నారన్నారు. జగన్ తుగ్లక్ నిర్ణయాలతో దేశానికి నష్టం కలుగుతుంటే..మోదీ మందలించకుండా దండేసి దణ్ణం పెడతారా? అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.