మందడంలో పరిస్థితి ఉద్రిక్తం
అమరావతి ఫిబ్రవరి 13,
దీక్షా శిబిరంపై ఓ వ్యక్తి మందు సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కిష్టాయిపాలెంలో రాజధాని కోసం చేపట్టిన దీక్షా శిబిరంపై ఓ వ్యక్తి మందు సీసా విసిరేశాడు. బస్సులో నుంచి మందు సీసా విసిరేయడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బస్సును అడ్డుకున్న గ్రామస్తులు మందడంలో బస్సును నిలిపివేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.