ఏ పథకం ఆగిపోయినా నేను ప్రశ్నిస్తా
- పవన్ కల్యాణ్
కర్నూలు ఫిబ్రవరి 13
కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం అయిన ఏ పథకం ఆగిపోయినా తాను ప్రశ్నిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం జిల్లాలో రెండో రోజు పర్యటించిన పవన్ జోహరాపురం బ్రిడ్జ్, కర్నూలు శివార్లలో ఎన్టీఆర్ గృహాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాయకులను ఎన్నుకునే ముందు ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రలోభాలకు గురై ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే ఇబ్బందులే ఉంటాయని తెలిపారు. ధ్యతాయుతమైన నేతను ఎన్నుకోకుంటే సమస్యలొస్తాయని పవన్ అన్నారు. పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పారు. పోరాటాలు చేసే జన సైనికుల కోసం అన్వేషిస్తున్నామని పవన్ వెల్లడించారు.