YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
లక్నో  ఫిబ్రవరి 13
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భాదన్‌లోని ఆగ్రా-లక్నో జాతీయ రహదారి పై బస్సు, ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మరణించగా, దాదాపు 31 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన వారిని స్థానిక సైఫై మినిపిజిఐ ఆస్పత్రికి తరలించారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.ఆగ్రో-లక్నో జాతీయ రహదారిపై 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు దిల్లీ నుంచి బిహార్‌లోని మోతిహరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Related Posts