రాయల సీమ ద్రోహి పవన్ కళ్యాణ్....
పవన్ కు విద్యార్థి సంఘాల నిరసన సెగ రాయలసీమ అభివృద్ధికి అడ్డుపడుతున్న పవన్
ఎమ్మిగనూరు ఫిబ్రవరి 13
పట్టణము లో. సోమప్ప సర్కిల్లో నిరసన చేసిన విద్యార్థి సంఘాలు .. వీరేశ్ యాదవ్, మహేంద్ర బాబు, ఉసేని ,నరసన్న ,కృష్ణ,కాజా, రాయలసీమలో హైకోర్టు మరియు రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, పవన్ దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, రాయలసీమ ప్రాంత వాసులు గుండాల గా అని మాట్లాడటం సబబు కాదని ఇలాంటి రాయల సీమ ద్రోహి రాయలసీమలో ప్రయత్నించి అర్హత లేదని సోమప్ప సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి ప్రాజెక్టులు పరిశ్రమలు నిధులు నీళ్ల కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట మాట్లాడటం తగదని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి ప్రతి ఒక పార్టీ సహకరించాలని లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు . పోలీస్ స్టేషన్లో అనంతరం పూచితో విడుదల చేశారు . సంఘాల నాయకులు కెల్విన్, రామకృష్ణ రామకోటి పాల్గొన్నారు