YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

10 నెలలుగా జీతం ఇవ్వకుండా వేధింపులు

10 నెలలుగా జీతం ఇవ్వకుండా వేధింపులు

10 నెలలుగా జీతం ఇవ్వకుండా వేధింపులు
విజయవాడ, ఫిబ్రవరి 13
సీనియర్ ఐపీఎస్, ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. తన సస్పెండ్‌ను క్యాట్‌లో సవాల్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని.. కొన్ని ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తన సస్పెన్షన్ చట్ట విరుద్దమని ప్రకటించాలని ఏబీ కోరారు. గతేడాది మే నుంచి తనకు జీతం కూడా చెల్లించడం లేదన్నారు.ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం గత వారం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏబీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాల కొనుగోలు చేశారని ప్రభుత్వం చెబుతోంది. ఏబీ తన కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారట. విదేశీ సంస్థతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని తెలిపింది. నాణ్యత లేని నిఘా పరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని.. కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్థానం కల్పించలేదని ప్రభుత్వం చెబుతోంది.టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేస్తున్న ఆయన్ను ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ చేశారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు చాలా కాలం పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కక్ష సాధింపు వైఖరితోనే ఇలా చేస్తున్నారనే ఏబీ అంటున్నారు. ఇటు టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు

Related Posts