YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 రెండు వేల కోట్లపై కూపీ లాగుతున్నారు...

 రెండు వేల కోట్లపై కూపీ లాగుతున్నారు...

 రెండు వేల కోట్లపై కూపీ లాగుతున్నారు...
హైద్రాబాద్, ఫిబ్రవరి 14,
వారం రోజులుగా జరుపుతున్న సోదాలపై ఆదాయపు పన్ను శాఖ సంచలన ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించి దాదాపుగా 40 చోట్ల జరిపిన సోదాల్లో రూ. రెండు వేల కోట్లకు పైగా అవకతవకలను గుర్తించినట్లుగా ఆదాయపు పన్ను శాఖ ప్రకటించారు. తెలంగాణలో ప్రతిమ గ్రూప్ కంపెనీల ఓనర్.. టీఆర్ఎస్ కీలక నేత బోయినపల్లి వినోద్‌కుమార్ సమీప బంధువు బోయినపల్లి శ్రీనివాసరావు, కడప జిల్లా టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డికి చెందిన కంపెనీలపై ఈ నెల ఆరో తేదీ నుంచి సోదాలు జరిగాయి. వీటితో పాటు.. మరో కంపెనీకి పైనా సోదాలు చేసినట్లుగా.. ఐటీ శాఖ ప్రకటించింది. సోదాల్లో రూ.2వేల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలను గుర్తించామని.. లావాదేవీలు జరిగిన విషయాన్ని ఈ మెయిల్‌, వాట్సాప్‌ సందేశాల ద్వారా గుర్తించామని ఐటీ శాఖ తెలిపింది. బోగస్ కంపెనీలు పెట్టి.. నకిలీ ఇన్వాయిస్‌లతో నగదు చెలామణి చేశారని.. ఓ కంపెనీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పేరుతో నిధులు సమీకరించిందని.. ఐటీ శాఖ తెలిపింది.లంగాణలోని పేరుమోసిన మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు సహా పలు చోట్ల సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ సోదాల్లో రూ. 2,000 కోట్లకు పైగా లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు ప్రకటించింది.ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పుణే సహా 40 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిపినట్లు తెలిపారు. ఇందులో భాగంగా బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, తప్పుడు బిల్లులతో భారీ కుంభకోణాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్‌బాయిస్‌ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ రూ. 2,000 కోట్లు చేతులు మారినట్లు భావిస్తున్నట్లు వెల్లడించారు.దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ- మెయిల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతో పాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు పేర్కొంది. ఒక ప్రముఖ వ్యక్తికి చెందిన మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై జరిపిన దాడులతో ఈ కీలక ఆధారాలు సేకరించినట్లు  వెల్లడించింది.ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారని ఐటీ అధికారులు వెల్లడించారు. పన్ను లెక్కలకు దొరకకుండా డొల్ల కంపెనీల ద్వారా రూ. 2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధులను దారి మళ్లించినట్లు గుర్తించామన్నారు. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడైందని తెలిపారుఐటీ దాడుల్లో భాగంగా లెక్కల్లో చూపని రూ. 85 లక్షల నగదు, రూ. 71 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేసినట్లు తెలిపారు. కాగా, గత 6 రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌రావుకు చెందిన నివాసాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.

Related Posts