YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ఆ అమ్మాయిని మూడు సార్లు అమ్మేశారు

ఆ అమ్మాయిని మూడు సార్లు అమ్మేశారు

ఆ అమ్మాయిని మూడు సార్లు అమ్మేశారు
లక్నో, ఫిబ్రవరి 14
ఆ యువతిని కిడ్నాప్ చేసి మానసికంగా, శారీరకంగా అత్యంత దారుణంగా హింసించిన ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఆగ్రా ప్రాంతానికి చెందిన ఓ యువతి(19) తన తల్లిదండ్రులతో కలసి నివాసం ఉండేది. ఆమెపై కన్నేసిన అదే ప్రాంతానికి చెందిన ఓంవతి అనే మహిళ.. ఓ ఆస్పత్రి యజమాని, మరో గాజుల ఫ్యాక్టరీ యాజమానితో ముఠాగా ఏర్పడి యువతిని కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి ఆమె నిత్యం నరకం చవిచూసిందియువతిని అపహరించిన ముఠా ఆమెను కేవలం రూ.50 వేలకి 2017లో అమ్మేశారు. ఆమెను బిచియా  గ్రామానికి చెందిన పప్పు గుజ్జార్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు. యువతిని తీసుకొచ్చి అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డారు. గుర్జార్ గ్యాంగ్ సభ్యులు ఆమెను దారుణంగా రేప్ చేశారు ఆమెకు నిత్యం నరకం చూపించారు. కోరిక తీరిన తర్వాత గుర్జార్‌ ఆమెను వేరొకరి వద్దకు పంపించాడు.ఆ తరువాత ఏడు నెలల గర్భంతో ఉన్న యువతిని పచాదియాపురకి చెందిన ప్రేమ్‌ సింగ్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు. మళ్లీ అదే నరకం. ప్రేమ్ సింగ్.. మరికొందరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. ఈ క్రమంలో తనకు ఆడపిల్ల పుట్టింది. చిన్నారిని పోషించడానికి కూడా ఇష్టపడని ప్రేమ్ సింగ్ ఆమెను రూ.2 లక్షలకు విక్రయించాడు. అనంతరం తల్లిని కూడా మరొకరికి అప్పగించాడు.కంచన్‌పుర పరిధిలోని రామ్‌దిన్ గుజ్జార్ అనే వ్యక్తికి ఆమెను మూడోసారి అమ్మేశారు. అక్కడ కూడా అవే వేధింపులు. సామాహిక అత్యాచారం. ఎందుకు బతికి ఉందో తెలియని పరిస్థితిలో దీనంగా బతుకీడుస్తున్న ఆమెకు ఓ రోజు ఫోన్ చేతికొచ్చింది. దాంతో ఈ దారుణ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ తీసుకున్న యువతి వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తన కిడ్నాప్.. అత్యాచారం.. బిడ్డను అమ్మేయడం వరకూ అన్నీ చెప్పి భోరుమంది.కూతురి దారుణ పరిస్థితి విన్న తల్లిదండ్రులు వెంటనే కంచన్‌పుర పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఉన్న చోటును గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెకు నరకకూపం నుంచి విముక్తి కల్పించారు. నరకం నుంచి బయటపడిన బాధితురాలు ఓంవతి, ఆస్పత్రి యజమాని భోలారాం, ఫ్యాక్టరీ ఓనర్ దేవి సింగ్, పప్పు గుజ్జార్, ప్రేమ్ సింగ్, రామ్‌దిన్ సహా తనను హింసించిన భూపీందర్, రామ్‌నాధ్, దీనా తదితరులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేసే పనిలో 
 

Related Posts