YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆ మూడు బిల్లులపై ఆర్డినెన్స్

ఆ మూడు బిల్లులపై ఆర్డినెన్స్

ఆ మూడు బిల్లులపై ఆర్డినెన్స్
హైద్రాబాద్, ఫిబ్రవరి 14,
అసెంబ్లీ, శాసనమండలిలను ప్రోరోగ్ చేస్తూ..ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి మరో రెండు, మూడు వారాల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయినప్పటికీ.. హడావుడిగా ప్రోరోగ్ చేశారు. .మూడు రాజధానులు, మండలి రద్దు అంశాలకు సంబంధించి ఆర్డినెన్స్ లు జారీ చేయాలన్న వ్యూహంతోనే..ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సీఆర్డీఏ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో ఉన్నాయి. సెలక్ట్ కమిటీ ప్రక్రియ పీట ముడి పడింది. ఈ రెండు బిల్లులు మండలిలో ఉండటంతో ప్రభుత్వానికి ఏమీ చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే.. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి.. ఆర్డినెన్స్ జారీ చేస్తే.. అన్ని సమస్యలు పరిష్కారమైనట్లేనని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు..ప్రోరోగ్ చేశారు. అయితే.. బిల్లులు అసలు ఏ సభలోనూ లేకపోతే… ఆర్డినెన్స్‌లు ఇవ్వొచ్చు కానీ సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లులపై ఆర్డినెన్స్‌లు ఇస్తే  చెల్లవని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో ముందుగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ జారీ చేస్తే గవర్నర్ ఆమోద ముద్ర వేయాలి. ఆయన ముద్ర వేస్తే.. చాలా వరకూ ప్రభుత్వం అనుకున్న పని అయినట్లే. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో సానుకూల సంకేతాలు పొందారని.. అందుకే… అసెంబ్లీ, మండలిని ప్రోరోగ్ చేశారని అంటున్నారు. నిజానికి బుధవారమే..కేబినెట్ భేటీలోనే  అసెంబ్లీ, మండలిని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తేవాలని అనుకున్నారు. కానీ మోడీ అపాయింట్ మెంట్ ఖరారయినందున.. నిర్ణయం వాయిదా వేశారు. అసెంబ్లీ, మండలి ప్రోరోగ్ అయినందున వైసీపీ వ్యూహం ప్రకారం.. ఏ క్షణమైనా ఆర్డినెన్స్ జారీ చేస్ అవకాశం ఉంది. అయితే.. మంత్రులు పధ్నాలుగు రోజులు అయిపోయింది కాబట్టి.. బిల్లు పాస్ అయిపోయిందనే వాదన కూడా వినిపిస్తున్నారు. ఇప్పుడుసర్కార్ బిల్లు పాస్ అయిపోయింది.. ఆమోదించాలని.. గవర్నర్ కు పంపుతుందా.. లేక…ఆర్డినెన్స్ జారీ చేస్తుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ వ్యూహం ప్రకారం ఏదో ఓ నిర్ణయం తీసుకోవచ్చు..కానీ ఏ నిర్ణయం తీసుకున్నా… వివాదాస్పదమయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.

Related Posts