రియల్ ఎస్టేట్ పై కట్టు కథనాలు
తాడేపల్లి ఫిబ్రవరి 14,
రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతున్నట్లు కొన్ని పచ్చ పత్రికలు కట్టు కథనాలు రాస్తున్నాయి. రూ.2వేల కోట్ల అక్రమ లావాదేవీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కోసమే ఇటువంటి కథనాలని ఎమ్మెల్యే పార్థసారధి ఆరోపించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. రాజధానికి భూములు ఇవ్వడానికి ముందే ఉండవల్లి,తాడేపల్లిలో భూములకు మూడు నుంచి నాలుగు కోట్ల ధర ఉంది. రాజధానికి భూములు ఇవ్వలేదని మంగళరిగి పరిధి గ్రామాల్లో ధరలు పడిపోయేలా చంద్రబాబు చేశారు. రాజధానికి భూములు ఇవ్వలేదని జోన్ పేరుతో ధరలు లేకుండా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ధరలు పడిపోవడానికి చంద్రబాబే కారణం. సబ్ కాంట్రాక్ట్ ల మేమెంట్ కోసమే ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమం నిర్వహించారు. రాజధాని అభివృద్ధి గురించి ఎప్పుడూ చంద్రబాబు ఆలోచించలేదని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేసేందుకే చంద్రబాబు వ్యవహరించారు. ల్యాండ్ పూలింగ్ తో రైతులకు అన్యాయం చేసి తన వర్గానికి చంద్రబాబు మేలు చేశారు. అమరావతి రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయం రంగం కుదేలయిందని విమర్శించారు.