YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

గుప్త నిధుల ముఠా అరెస్టు

గుప్త నిధుల ముఠా అరెస్టు

గుప్త నిధుల ముఠా అరెస్టు
అనంతపురం ఫిబ్రవరి 14, 
గుప్త నిధులు తవ్వే ముఠా సభ్యులను అనంతపురం జిల్లా పోలీసులు అరెష్టు చేశారు.బెంగళూరుకు చెందిన ఆనంద్‌స్వామి మంత్ర తంత్రాలతో స్వామీజీగా అవతారమెత్తాడు. రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామ సమీపంలోని శివాలయంలో పూజలు నిర్వహించేవాడు. ఈక్రమంలో పట్టణానికి చెందిన పాండుతో పరిచయం పెంచుకున్నాడు. మీ ఇంట్లో నిధులు ఉన్నాయని, దాన్ని బయటకు తీయకపోతే మీకు హాని జరుగుతుందని పాండుకు చెప్పి ఇంట్లో పూజలు చేశాడు. ఇనుప పెట్టెలో బొగ్గులు, మట్టివేసి పూజ అనంతరం ఇంట్లో పూడ్చి పెట్టాడు. ఈ పెట్టెను తీసేందుకు అఘోరాలను పిలుచుకుని వస్తానని, అప్పటి వరకు బయటకు తీయరాదని, తీస్తే ప్రాణాపాయం ఉందని బెదిరించాడు. పూజలు చేసినందుకు పాండుతో 43 లక్షల నగదు తీసుకున్నాడు.చివరికి ఆనంద్‌ స్వామి ఎంతకాలానికీ రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నాడు.ఈ ఘటనపై ఆనంద్‌స్వామి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముఠా సభ్యులను అరెష్టు చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.

Related Posts