YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 చంద్రబాబుపై అసత్య ప్రచారం

 చంద్రబాబుపై అసత్య ప్రచారం

 చంద్రబాబుపై అసత్య ప్రచారం
విశాఖపట్నం ఫిబ్రవరి 14
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, అతని బృందం చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేస్తోందని టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న సీఎం కోర్టు కేసులకు హాజరవకుండా తప్పించుకుంటున్నారన్నారు.రివర్స్‌ టెండరింగ్‌ అంటూ తనకు కావల్సిన వారికి పనులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ముందు తనపై ఉన్న కేసుల విచారణను త్వరగా పూర్తి చేసుకొని సీఎం తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని వాసుపల్లి డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా 40 చోట్ల ఐటీ దాడులు చేసి 2వేల కోట్ల పట్టుబడితే దానికి చంద్రబాబుతో ముడి పెట్టడం సరికాదని అన్నారు.ఐటీ దాడులకు గురైన ఒక ఇన్‌ఫ్రా కంపెనీకి ప్రభుత్వం పోలవరం కాంట్రాక్టును రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కట్టబెట్టిందని,దీని వల్ల పోలవరం నిర్మాణ పనులు సైతం ఆలస్యమవుతున్నాయన్నారు.అబద్ధాలతో ప్రజలను ఎంతో కాలం నమ్మించి, మోసం చేయలేరన్నారు.

Related Posts