YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

బరాత్ సౌండ్ తో వరుడు మృతి

బరాత్ సౌండ్ తో వరుడు మృతి

బరాత్ సౌండ్ తో వరుడు మృతి
నిజామాబాద్, ఫిబ్రవరి 15
వివాహమైన కొద్దిసేపటికే వరుడు మృతిచెందిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నమే వివాహం కాగా, రాత్రి ఊరేగింపు జరుగుతుండగా వరుడు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు. బోధన్ పట్టణానికి చెందిన మంగళి గణేశ్(25)‌కు శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా రాత్రి బారాత్‌ నిర్వహించారు. ఈ సమయంలో డీజే సౌండ్‌కు అస్వస్థతకు గురైన గణేశ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని బంధువులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.గణేశ్ గుండెపోటుతోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వివాహమైన కొద్ది గంటల్లోనే కట్టుకున్నవాడు మృతిచెందడంతో నవ వధువు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అంగరంగ వైభవంగా వివాహం జరిపించిన సంతోషం నిమిషాల్లోనే ఆవిరికావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. అంతకు ముందు బారాత్‌లో వధువుతో కలిసి ఎంతో ఉత్సాహంగా గణేశ్ డ్యాన్స్ చేశాడు. అయితే, కాసేపటి తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిపోయినట్టు బంధువులు తెలిపారు.

Related Posts