చంద్రబాబుపై అసత్య ప్రచారం
కాకినాడ ఫిబ్రవరి 15
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ఐటీ దాడులు గురించి ప్రధానంగా నెహ్రూ ప్రస్తావించారు. ఐటీ దాడులు అభూత కల్పన అని కొన్ని కథనాలు రాస్తున్నారని పేర్కొన్నారు.కాకినాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, చంద్రబాబు నాయుడుపై జగన్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా 40 చోట్ల ఐటీ రైడ్స్ జరిగాయని.. కానీ తెలుగురాష్ట్రాల్లో జరిగినట్టు మీడియాలో చూపిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద దొరికింది రూ.51 వేలు అని క్లారిటీ ఇచ్చారు. కానీ రూ.2 వేల కోట్లు శ్రీనివాస్ వద్ద పట్టుబడినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. మొత్తం వ్యవహారంలో వైసీపీ నేతలు తప్పించుకొనే ప్రయత్నం
చేస్తున్నారని ఆరోపించారు.