మూడు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు
న్యూఢిల్లీ ఫిబ్రవరి 15
సిక్కిం, కేరళ, మధ్య ప్రదేశ్ సహా మూడు రాష్ట్రాలకు బీజేపీ అధిష్టానం ఇవాళ నూతన అధ్యక్షులను ప్రకటించింది. సిక్కిం బీజేపీ చీఫ్గా దల్ బహదూర్ చౌహాన్, కేరళ బీజేపీ చీఫ్గా కె. సురేంద్రన్లను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. మధ్య ప్రదేశ్లో జబల్పూర్ ఎంపీ రాకేశ్ సింగ్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విష్ణుదత్ శర్మను నియమించారరు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్కు పరిమితమైన నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2015 ఢిల్లీ ఎన్నికల్లో 3 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ సారి కూడా కేవలం ఐదు స్థానాలు పెంచుకుని 8 చోట్ల విజయం సాధించింది.