సత్తుపల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
ఖమ్మం ఫిబ్రవరి 17
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ,టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యం లో భారీ హరిత హరం ర్యాలీ చేపట్టారు. సుమారు 1500 పాటశాల విద్యార్థిని విద్యార్థులు, టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలతో ర్యాలీ చేపట్టారు. జేవిఅర్ డిగ్రీ కాలేజ్ వద్ద నుండి పాత సెంటర్ వరకు ర్యాలీ చేశారు. అంతకముందు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెండా ఊపి ర్యాలీ నీ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం పలు చోట్ల విద్యార్థులు,నాయకులు మొక్కలు నాటారు.కేసీఆర్ జన్మదినం వేడుకలను సత్తుపల్లి పట్టణం లో టిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో నియోజక వర్గం లోని 5 మండలాలకు చెందిన నేతలు ఆధ్వర్యం లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.