పోలాల్లో దిగిన ప్రైవేటు విమానం
అనంతపురం ఫిబ్రవరి 17,
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఓ జెట్ విమానం అత్యవసర పరిస్థితుల్లో నేలపైకి దిగింది. ఈఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ విమానం మైసూరు నుంచి బళ్లారి జిందల్ ఫ్యాక్టరీకి వెళ్తుండగా మార్గ మధ్యంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పొలాల్లో విమానాన్ని సురక్షితంగా దించినట్లు పైలట్ తెలిపారు. ఈ సమయంలో విమానంలో పైలట్తో పాటు మరో వ్యక్తి ప్రయాణిస్తున్నట్లు సమాచారం.