భర్త, కుమార్తెతో సహా ఎమ్మెల్యే సోదరి మృతి
కరీంనగర్ ఫిబ్రవరి 17,
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధిక కుటుంబ సభ్యులు అలగనూరు కాలువలో పడి మృతి చెందారు. భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె సహస్రతో సహా ఎమ్మెల్యే సోదరి రాధిక అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం సాయంత్రం బైక్పై వెళుతున్న ఓ జంట ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. దాంతో అధికారులు కాలువలో నీటిని నిలిపి వేశారు. నీటిమట్టం తగ్గడంతో రాధిక కారు బయటికి కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి ముగ్గురిని బయటకు తీశారు. అనంతరం కారు నంబర్ ఆధారంగా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రావు సోదరి రాధిక కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి సోదరి మరణం తీరని దెబ్బవంటిదన్నారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని.. సోదరి కుటుంబం తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని పేర్కొన్నారు. అందుకే ఎలాంటి అనుమానం రాలేదని తెలిపారు. సీపీ కమలాహాసన్ మాట్లాడుతూ పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు