అమ్మ ఒడికి బీసీ నిధులు
అమరావతి ఫిబ్రవరి 17,
ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి గారడీ మాటలతో పబ్బం గడుపుకునేలా వైకాపా 9నెలల పాలన సాగింది. బలహీనవర్గాలు ఎప్పుడూ తేదాపాకు అండగా ఉంటారనే వారిని అణిచివేసే కుట్ర చేస్తున్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకుని ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. సోమవారం అయన మీడియతో మాట్లాడారు. బలహీనవర్గాల నిధులు దారిమళ్లిస్తున్నారని ప్రశ్నించటమే విజయ్ కుమార్ చేసిన తప్పా? పోస్టు పెట్టినందుకు ముఖానికి ముసుగువేసి తీవ్రవాదిలా చిత్రీకరిస్తారా అదే ప్రశ్న ఇప్పుడు మేము అడుగుతున్నాం..., ధైర్యం ఉంటే జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. బీసీల నిధులు అమ్మ ఒడికి మళ్లించి బలహీన వర్గాల పొట్టకొడుతున్నారు. ప్రజలు మంచి చేయటానికి అధికారం ఇస్తే అది మాపై కక్షకట్టేందుకు వినియోగిస్తారా. మాపై కేసులు పెట్టడానికి ప్రజలు అధికారం ఇచ్చారా అని ప్రశ్నించారు. మంత్రి బొత్స తానే లెక్కపెట్టినట్లు 2 వేల కోట్లు ఉన్నాయి అని చెప్పారు. సత్తిబాబు గారూ మీకూ నాకూ ఇంగ్లీష్ రాదు....! సత్తిబాబు అంటే సత్యం చెప్పాలి...కానీ బొత్స ను మా ప్రాంతం లో అసత్య బాబు అంటారని వ్యాఖ్యానించారు.