త్వరలోనే చంద్రబాబుకు జైలు
రాజమహేంద్రవరం ఫిబ్రవరి 17,
అభివృద్ధి,సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు హయాంలో ఆయన ఇచ్చిన మాటలు,హామీలతో, అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారు. రైతు భరోసా,ఆరోగ్య శ్రీ,ఇళ్ల పట్టాలు కౌలు రైతులకు కూడా జగన్ న్యాయం చేస్తున్నారు, అమ్మఒడి ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారూ జగన్ మోహన్ రెడ్డి అని రాజానగరం శాసనసభ్యుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో జన్మభూమి పేరుతో పెట్టిన కమిటీలు లంచాలు తీసుకుని పని చేసేవారు. అమరావతి లో సీఆర్డీయే కాకుండా ..చంద్రబాబు రియల్ ఎస్టేట్ మాదిరిగా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగింది. చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తాయి, అన్ని శాఖల్లో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు బినామీ శ్రీనివాస్ ఇంట్లో 2వేల కోట్ల రూపాయల అవినితి జరిగిందంటే..నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు తొందర లొనే ఊచలు రోజు దగ్గరలోనే ఉంది, ఐటీ రైడ్స్ లో ఒక్కొక్కటి బయటపడుతున్నాయని అన్నారు. 500 నుంచి 600 కోట్ల రూపాయలు రాజానగరం నియోజక వర్గంలో ఇసుక అవినీతి జరిగింది. ఢిల్లీ వెళ్లి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలనని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చెప్తున్నారు, అలా పకులడాల్సిన అవసరం జగన్ మోహన్ రెడ్డి కి లేదు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట..ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికి పోయిన వ్యక్తి చంద్రబాబని అయన అన్నారు.