YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు యాత్రపై సమీక్ష

చంద్రబాబు యాత్రపై సమీక్ష

 

చంద్రబాబు యాత్రపై సమీక్ష
ఒంగోలు ఫిబ్రవరి 17
ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ప్రకాశంజిల్లా టీడీపీ అధ్యక్షుడు,  మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అధ్యక్షతన జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.  మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. సమావేశంలో ముఖ్యంగా ఈ నెల 19 వ తేదీన జాతీయ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  రాష్ట్ర వ్యాప్త 45 రోజుల ప్రజా చైతన్య బస్ యాత్ర ప్రకాశంజిల్లాలో ప్రారంభం కానున్న నేపద్యంలో యాత్ర విజయవంతం చేయడంపై నాయకులు చర్చించారు. టీడీపీ సంస్థాగత గ్రామ,మండల కమిటీ లు త్వరితగతిన ఏర్పాటు చేయడం,వృద్ధులు,వితంతువుల,టీడీపి వర్గీయుల నెపంతో పింఛన్లు,రేషన్ కార్డ్స్ భారీ ఎత్తున తొలగించి,సామాజిక తనిఖీ పేరుతో వారిని అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించడాని పై నేతలు చర్చించినారు, ఐటీ దాడులతో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పి.ఎస్.శ్రీనివాస్ వద్ద రెండు వేల కోట్లు పట్టు దొరికాయని,కొన్ని పత్రికలలో రావడంపై ఈ సమావేశంలో నాయకులు, చర్చించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ శాసన సభ్యులు కరణం బలరాం,ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, డోలా బాల వీరంజనేయ స్వామి,మాజీ శాసనసభ్యులు బి.ఎన్. విజయకుమార్,కందుల నారాయణరెడ్డి, సాయి కల్పన,మాజీ జడ్పీ వైస్ చైర్మన్ డా.నూకసాని బాలాజీ,మాజీ లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్షన్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts