YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

మార్చి 3న నిర్భయ నిందితులకు ఉరి

మార్చి 3న నిర్భయ నిందితులకు ఉరి

మార్చి 3న నిర్భయ నిందితులకు ఉరి
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 17
నిర్భయ దోషులకు పాటియాలా ట్రయల్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. మార్చిన 3న ఉదయం ఆరు గంటలనకు నలుగురు దోషులను ఉరి తీయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తాజా తీర్పుతో తిహార్ జైల్లో మార్చి 3న వీరందర్నీ ఒకేసారి ఉరి తీసే అవకాశం ఉంది. నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయాల్సి ఉండగా.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వారి ఉరి శిక్ష అమలును నిలిపేయాలని పాటియాల కోర్టు జనవరి 31న తీర్పునిచ్చింది. దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని స్పష్టం చేసింది.ఈ తీర్పును సవాల్ చేస్తూ.. కేంద్రం హైకోర్టుకు వెళ్లగా.. ట్రయల్ కోర్టు తీర్పును న్యాయస్థానం సమర్థించింది. దీంతో కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లింది. నిర్భయ దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు జనవరి 22ను ఉరితీయాలంటూ జనవరి 7న పాటియాలా హౌస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉండటం, దోషులు అప్పీలు చేయడంతో ఉరి వాయిదాపడింది.ఫిబ్రవరి 1న ఉరి తీయాలని ఆదేశిస్తూ ట్రయల్ కోర్టు జనవరి 17న రెండోసారి డెత్ వారంట్ జారీ చేసింది. దీనిపై దోషుల తరపు న్యాయవాది వాదనలను వినిపిస్తూ ఒకరి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉందని, నిబంధనల మేరకు మిగిలిన ముగ్గుర్ని ఉరి తీయడం సాధ్యం కాదన్నారు.నిర్భయ దోషులు న్యాయపరంగా తమ ముందున్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని గతంలో న్యాయ స్థానం అభిప్రాయపడింది. కాగా.. నా హక్కు సంగతి ఏంటని నిర్భయ తల్లి కోర్టు ప్రాంగణంలో వాపోయారు. దోషులకు ఉరిశిక్ష అమలు కాకుండా చూస్తానని లాయర్ సవాల్ చేశారని ఆమె ఆరోపించారు.

Related Posts