YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 కర్నూలు వైసీపీలో రచ్చరచ్చ

 కర్నూలు వైసీపీలో రచ్చరచ్చ

 కర్నూలు వైసీపీలో రచ్చరచ్చ
కర్నూలు, ఫిబ్రవరి 17
కర్నూలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మంగళవారం (ఫిబ్రవరి 18) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌‌రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కర్నూలులో సీఎం జగన్ కాన్వాయ్‌ వెళ్లే ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మెహన్‌రెడ్డి కూడా ఐదు రోడ్ల కూడలి నుంచి ప్రభుత్వ అతిథిగృహం మీదుగా బహిరంగ సభ వరకు సీఎంకు ఆహ్వాన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.అయితే  మున్సిపల్‌ అధికారులు ఈ ఫ్లెక్సీలను తొలగించి ట్రాక్టర్లలో తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్వీ మెహన్‌రెడ్డి, అయన అనుచరులు వచ్చి మున్సిపల్‌ అధికారులను, సిబ్బందిని ప్రశ్నించగా..  ఎమ్మెల్యే ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగిస్తున్నట్లు వారు చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న పోలీసు ఉన్నతాధికారులకు ఎస్వీ మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.ఇప్పటికే పలు సందర్భాల్లో వీరిద్దరి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. సీఎం పర్యటన ముందు రోజే ఫ్లెక్సీల వివాదం మరింత నిప్పును రాజేసినట్లుయింది. కాగా, సీఎం జగన్మోహన్‌రెడ్డి హెలిప్యాడ్‌ నుంచి బహిరంగ సభకు వచ్చే కాన్వాయ్‌ మార్గంలో హోర్డింగ్‌లను తనను కాదని ఎవరికీ అద్దెకు ఇవ్వరాదని యాడ్స్‌ యాజమాన్యానికి ఎమ్మెల్యే చెప్పినట్లు తెలుస్తోంది.

Related Posts