YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పడుగుపాడు లో చేతబడి కలకలం…. భయాందోళనలో ప్రజలు

పడుగుపాడు లో చేతబడి కలకలం…. భయాందోళనలో ప్రజలు

నెల్లూరు ఫిబ్రవరి 18 నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపాడు గ్రామంలో లో చేసిన చేతబడి కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పడుగుపాడు గ్రామం లోని అల్లా జల ప్రసాదం రోడ్డు వద్ద క్రీడాకారులు అంతా క్రికెట్ ఆడుకునే మైదానం ఉంది. అయితే ఆ మైదానంలో లో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సినిమాలను తలపించే విధంగా ఒక పెద్ద బొమ్మను గీసి అందులో రంగులు  వేసి  ఈ బొమ్మకు నిమ్మకాయలు గుమ్మడికాయలు పెట్టి ఇ మేకులు కొట్టి ఇ చేతబడి చేశారు. ఆ పరిసరాల్లో ఇంకా నల్లటి కోడిని కూడా బలి ఇచ్చారు.  సోమవారం ఉదయం రోజు లాగానే  క్రికెట్ ఆడేందుకు క్రీడాకారులు మైదానం కి వెళ్లారు. అయితే అక్కడ అ జరిగిన ఈ ఘటన చూసి భయాందోళనకు గురై ఇక నుంచి పారిపోయారు. దీంతో గ్రామ అంతా ఈ విషయం తెలిసి  ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి శుద్ర మాంత్రికుల ను అరికట్టాలని నివాసాల మధ్య ఇలాంటి ఘటన జరగడం ఏంటి అని విమర్శలు గుప్పించారు. పోలీసులు వీటిపై  దృష్టిపెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు

Related Posts