YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

ట్రంప్ 3గంటల పర్యటన కోసం100కోట్లు ఖర్చు చేస్తున్న భారత్ 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు

ట్రంప్ 3గంటల పర్యటన కోసం100కోట్లు ఖర్చు చేస్తున్న భారత్ 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు

ట్రంప్ 3గంటల పర్యటన కోసం100కోట్లు ఖర్చు చేస్తున్న భారత్
         10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు
అహ్మదాబాద్ ఫిబ్రవరి 19 
ఈ నెల 24న భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకోనున్న ఆయన అక్కడ మూడు గంటలు గడపనున్నారు. దీంతో ట్రంప్ 3గంటల పర్యటన కోసం విజయ్ రూపాణి సర్కార్ రూ. 100కోట్లు వెచ్చిస్తోంది. అహ్మదాబాద్ నగర పాలక సంస్థ, అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఖర్చులను భరిస్తున్నాయి. కేంద్రం మరో రూ. 14కోట్లు అందజేయనుంది. కొత్త రోడ్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతుకు రూ. 80 కోట్లు కేటాయించగా.. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక ట్రంప్ భద్రతకు రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు అధికారులు. మోడీ, ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలకు మరో రూ. 4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రోడ్ షోకు సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.కాగాప్రధాని మోదీ అంటే తనకెంతో ఇష్టమని ట్రంప్‌ తెలిపారు. ఎయిర్‌పోర్టు, స్టేడియానికి మధ్య 70 లక్షల మంది స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని మోదీ తనతో చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో ట్రంప్‌ పర్యటించనున్నారు. సబర్మతిలోని గాంధీ ఆశ్రమాన్ని కూడా ట్రంప్ సందర్శించే అవకాశం ఉంది. 

Related Posts