YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వివక్షకు గురవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు :జీవన్‌రెడ్డి

వివక్షకు గురవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు :జీవన్‌రెడ్డి

వివక్షకు గురవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు :జీవన్‌రెడ్డి
హైదరాబాద్ ఫిబ్రవరి 19
తెలంగాణలో ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి విమర్శించారు. ఒక్క అదనపు పోస్టు కూడా క్రియేట్‌ చేయకుండా.. ఉన్నవాళ్లతోనే పని చేయిస్తున్నారని  విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాలని శాసించాయన్నారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కూడా 29శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారన్నారు. నిరుద్యోగ భృతి లేదని.. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కూడా లేదన్నారు. పక్క రాష్ట్రం సీఎం జగన్‌ని చూసైనా నేర్చుకోవాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు.

Related Posts