YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 సీయేయే ఎన్నార్సీ లతో మన దేశ ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదు

 సీయేయే ఎన్నార్సీ లతో మన దేశ ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదు

 సీయేయే ఎన్నార్సీ లతో మన దేశ ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదు
- ఎమ్మెల్యే  రాజాసింగ్
షాద్ నగర్, ఫిబ్రవరి 19
 రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో హిందూ వాహిణి ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హాజరయ్యారు. సుమారు వెయ్యు మంది హిందూ వాహిణీ కార్యకర్తలు ఫరూఖ్ నగర్ వెంకటేశ్వర దేవాలయం నుండి మొదలుకుని భారీ ర్యాలీని తీశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాజా సింగ్ మాట్లాడుతూ... ఎన్నార్సీ సీయేయే  బిల్లు ను దేశంలో అక్రమంగా చొరబడి అలజడులు సృష్టిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుండి వచ్చి దాక్కున్న దేశ ద్రోహుల కోసమే అన్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఇదే విషయాన్ని ఎన్ని సార్లు చెప్పిన వినకుండా కొంత మంది నాయకులు, కొన్ని పార్టీలు రాజకీయాల కోసమే అనవసర రాద్ధాంతం చేస్తూ .. వ్యతిరేక ర్యాలీలు తీస్తూ, అల్లర్లు సృష్టిస్తూ, ర్యాలీలు తీసేవారికి మద్దతును ఇస్తున్నారన్నారు. మోదీ, అమిత్ షా లు ఉన్నంత కాలం దేశ ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. దేశం అన్ని రకాలుగా ముందుకు వెళ్తుందన్నారు.

Related Posts